News February 21, 2025
అరకు: సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలి

వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విట్టర్), ఇతర సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని అరకు CI హిమగిరి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యక్తుల, సంస్థలపై అసత్య ప్రచారాలు, అవమానకరమైన ఫొటోలు, వీడియోలు పెడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
Similar News
News November 18, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT
News November 18, 2025
GWL: మాదక ద్రవ్యాలతో మనుగడకు ముప్పు-DMHO

మాదక ద్రవ్యాలతో మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో వైద్య సిబ్బందికి మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. మద్యం మత్తు జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
News November 18, 2025
అల్లూరి: ‘భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’

రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ, ఆర్వోఎఫ్ఆర్, మ్యుటేషన్కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ నందు ఆధార్ నంబర్లను సరిచేసి వెంటనే అనుమతి కోసం మండల వ్యవసాయ అధికారుల లాగిన్కు పంపించాలన్నారు.


