News March 25, 2025

అరబ్ దేశంలో పోలవరం వాసి మృతి

image

పోలవరం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసఫ్ మంగళవారం తెల్లవారుజామున అరబ్ దేశంలో గుండెపోటుకు గురై మరణించారు. ఎన్నో ఏళ్లుగా అరబ్ దేశంలో పనిచేస్తూన ఆయన స్వగ్రామానికి నెల రోజులక్రితం వచ్చి తిరిగి వెళ్లాడు. అందరితో అప్యాయంగా మెలిగేవాడని యూసఫ్ ఇక లేరనే మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News October 23, 2025

చొప్పదండి పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరు

image

చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులతో చొప్పదండి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 23, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓కొత్తగూడెం: రామవరంలో కార్డెన్ సెర్చ్
✓జిల్లా వ్యాప్తంగా రోడ్లకు మరమ్మతులు చేయాలి: కలెక్టర్
✓జిల్లావ్యాప్తంగా కొమరం భీమ్ జయంతి వేడుక
✓పినపాక: రెండు బైక్ లు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
✓BASలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
✓డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టండి: ఇల్లందు డీఎస్పీ
✓ఈనెల 24న పాల్వంచ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
✓మణుగూరు: సురక్ష బస్టాండ్లో పోలీసుల తనిఖీలు
✓రోడ్లు బాగు చేయాలని BRSనిరసనలు

News October 23, 2025

PDPL: పత్తి రైతులకు కొత్త చిక్కులు.. స్లాట్ బుకింగ్ తప్పనిసరి

image

పత్తి పంట విక్రయించే రైతులకు సిసిఐ కొత్త నియమాలు తీసుకొచ్చింది. రైతులు తమ పత్తిని విక్రయించాలంటే వారం రోజుల ముందుగానే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన తేదీ, సమయానికే కొనుగోలు కేంద్రాలకు రావాలని అధికారులు తెలిపారు. ఎక్కువసేపు క్యూలలో నిలబడి ఇబ్బంది పడకుండా ఉండడమే ఈ విధానం లక్ష్యమని సీసీఐ వెల్లడించింది. కాగా పెద్దపల్లి జిల్లాలో 49 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు.