News March 25, 2025

అరబ్ దేశంలో పోలవరం వాసి మృతి

image

పోలవరం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసఫ్ మంగళవారం తెల్లవారుజామున అరబ్ దేశంలో గుండెపోటుకు గురై మరణించారు. ఎన్నో ఏళ్లుగా అరబ్ దేశంలో పనిచేస్తూన ఆయన స్వగ్రామానికి నెల రోజులక్రితం వచ్చి తిరిగి వెళ్లాడు. అందరితో అప్యాయంగా మెలిగేవాడని యూసఫ్ ఇక లేరనే మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News February 26, 2026

GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8  తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.

News February 26, 2026

ఏలూరు: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 15,972 హాజరయ్యారని చెప్పారు. 385 మంది వివిధ కారణాలతో గైర్హాజరు అయ్యారని వివరించారు. జనరల్ విద్యార్థులు 14,128, ఒకేషనల్ విద్యార్థులు 1,844 మంది పరీక్ష రాశారని వివరించారు. దీంతో పరీక్షా శాతం 98 శాతంగా నమోదు అయిందన్నారు.

News February 26, 2026

భారత్ ప్లేయింగ్-11 అంచనా.. ఎలా ఉంది?

image

T20WC: భారత్ సెమీస్ వెళ్లాలంటే నేడు జింబాబ్వేతో తప్పక గెలవాల్సిందే. రా.7 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్లేయింగ్-11 ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కొందరు స్పోర్ట్స్ అనలిస్టుల ప్రకారం తుది జట్టు..
భారత్: అభిషేక్, ఇషాన్, సంజూ శాంసన్, సూర్య (C), తిలక్ వర్మ, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
> టీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.