News March 30, 2025

‘అరుకు ఎంపీని ఆహ్వనించకపోవడం ఆమెను అవమానించమే’

image

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్లో ఏర్పాటు చేసిన సందర్భంలో అరకు ఎంపీ తనూజరాణిని ఆహ్వానించకపోవడం ఆమెను అవమానించడమే అని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురంలో శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఎన్డీఏ కూటమి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని, ప్రతి చోటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు.

Similar News

News October 31, 2025

పంచ భూతాలే మానవ శరీరం

image

మానవ దేహం పంచభూతాలతో ఏర్పడింది. చర్మం, వెంట్రుకలు, కండరాలు భూతత్వానికి సంబంధించినవి. ఆకలి, నిద్ర, దాహం అగ్నితత్వానికి చెందినవి. నడవడం, పరుగెత్తడం వంటి కదలికలన్నీ వాయుతత్వం. మూత్రం, రక్తం, వీర్యం వంటి ద్రవాలు జలతత్వం కిందకి వస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఆలోచన (చింత), శబ్దం, దుఃఖం (శోకం) అనేవి ఆకాశతత్వం లక్షణాలు. నూనెతో తలకు, ఒంటికి చేసే అభ్యంగనం ద్వారా ఈ సర్వేంద్రియాలకు శాంతి, శక్తి లభిస్తాయి.

News October 31, 2025

5,346 టీచర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

image

ఢిల్లీలో 5,346 TGT పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.44,900 – రూ.1,42,400 అందుతుంది. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News October 31, 2025

HYD: పటేల్‌కు నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా HYDలోని గన్‌పార్క్ వద్ద మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ దేశ అభివృద్ధితో పాటు సమైక్యత కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు.