News March 30, 2025

‘అరుకు ఎంపీని ఆహ్వనించకపోవడం ఆమెను అవమానించమే’

image

అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్లో ఏర్పాటు చేసిన సందర్భంలో అరకు ఎంపీ తనూజరాణిని ఆహ్వానించకపోవడం ఆమెను అవమానించడమే అని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్వతీపురంలో శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఎన్డీఏ కూటమి ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని, ప్రతి చోటా ఇదే పరిస్థితి ఎదురవుతోందని మండిపడ్డారు.

Similar News

News April 17, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS

image

@కలెక్టరేట్‌లో NH భూసేకరణపై అధికారులతో కలెక్టరేట్ సమీక్ష @కోరుట్ల మాజీ కౌన్సిలర్ పై మహిళ దాడి @రాయికల్‌లో మొక్కజొన్నకు నిప్పంటించిన దుండగులు @పలు మండలాల్లో భూభారతి చట్టం పై అవగాహన సదస్సు @ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో రూ. 74,723 ఆదాయం @కథలాపూర్‌లో అగ్నిప్రమాదం.. 400 ఈత చెట్లు దగ్ధం  @ప్రభుత్వ పాఠశాలల్లో యుడైస్ వివరాల పరిశీలన.

News April 17, 2025

మే 8న ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మే 8న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. ఉ.11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మే 6 సాయంత్రంలోగా మంత్రివర్గ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. తల్లికి వందనం ఇతర పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News April 17, 2025

 సంగారెడ్డి: ‘రెవెన్యూ పారదర్శకతకు సీఎం ప్రత్యేక కృషి’

image

రెవెన్యూ శాఖ పారదర్శకత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో భూభారతి అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పటివరకు కలెక్టరేట్ చుట్టూ రైతులు తిరిగేవారని, ఈ చట్టంతో అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాదురి పాల్గొన్నారు.

error: Content is protected !!