News February 9, 2025
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్: డిపో మేనేజర్

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్ నడుపుతున్నట్లు RTC WGL-1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 10న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలు దేరుతుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. వివరాలకు 9959226047, 9494107944 నెంబర్లో సంప్రదించాన్నారు.
Similar News
News March 28, 2025
నేటి ముఖ్యాంశాలు

* తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
* ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్
* ఆరు గ్యారంటీలు నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం: శ్రీధర్ బాబు
* రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR
* AP: పోలవరం నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారం: CBN
* 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల
* హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్కు లేదు: జగన్
News March 28, 2025
BREAKING: లక్నో చేతిలో SRH ఓటమి

IPL-2025: ఈ సీజన్లో SRHకు తొలి ఓటమి ఎదురైంది. ఉప్పల్ స్టేడియంలో SRHపై లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 16.1 ఓవర్లలోనే సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. పూరన్ 26 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 రన్స్ చేసి మ్యాచును తమవైపు లాగేశారు. ఓపెనర్ మార్ష్ (52) హాఫ్ సెంచరీతో రాణించారు. కమిన్స్ రెండు వికెట్లు తీశారు.
News March 28, 2025
జగిత్యాల మార్కెట్ ధరల సమాచారం మీ కోసం

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,215, కనిష్ట ధర రూ. 1,918లుగా పలికాయి. అటు కందులు గరిష్ఠ ధర రూ. 6,495, కనిష్ఠ ధర రూ. 5,500, అనుములు రూ. 4896, పసుపు కాడి గరిష్ఠ ధర రూ. 11,000, కనిష్ఠ ధర రూ. 7,000, పసుపు గోళం గరిష్ఠ ధర రూ. 9,500, కనిష్ఠ ధర రూ. 5,000, వరి ధాన్యం (జైశ్రీరాం రకం) రూ. 2,311లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.