News March 10, 2025

అర్జీలను స్వీకరించిన చిత్తూరు జిల్లా కలెక్టర్

image

చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీలు సమర్పించి, జిల్లా అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

చిత్తూరు: తండ్రి రిటైర్డ్ మిలిటరీ.. కొడుకు దొంగ

image

బెంగళూరు ATM చోరీ కేసులో <<18367776>>దోచుకున్న<<>> డబ్బులు దాచిపెట్టిన నవీన్ తండ్రి ఓ రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి. గ్రామంలో ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు నవీన్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. ATM చోరీ కేసులో నవీన్ ఇంట్లో దాచిపెట్టిన రూ.5.60 కోట్లను స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు.

News November 23, 2025

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 22, 2025

ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలి: కలెక్టర్

image

ఈ నెల 24 నుంచి 29 తేదీ వరకు, అలాగే డిసెంబరు 3వ తేదీన నిర్వహించనున్న “రైతన్నా మీ కోసం” కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొనాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శనివారం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌తో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ యాప్‌తో రైతుకు చేరువగా సాంకేతికత ఉంటుందన్నారు. ఫార్మర్ యాప్‌ను ప్రతీ రైతుకూ చేరువ చేయాలని ఆయన ఆదేశించారు.