News March 17, 2025

అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

image

అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఆయన వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను క్లోజ్ చేసేటపుడు వ్యక్తిగతంగా అర్జీదారులతో మాట్లాడి, అర్జీలకు పరిష్కారం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News November 28, 2025

ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

image

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్‌క్వార్టర్‌గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్‌క్వార్టర్‌గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.