News April 18, 2025

అర్జీలు స్వీకరించిన హోం మంత్రి అనిత

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన మంత్రి పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News

News April 20, 2025

IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

image

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

News April 20, 2025

పెద్దపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. నిన్న రాత్రి సుమారుగా 11, 12 గంటల సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పొత్కపల్లి గ్రామానికి చెందిన సుధగోని తిరుపతిగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

టూత్ పేస్ట్‌లో హానికర సీసం, పాదరసం: లీడ్ సేఫ్ మామా

image

కొన్ని ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్లలో విషపూరిత లోహాలు ఉన్నట్లు ‘లీడ్ సేఫ్ మామా’ సంస్థ అధ్యయనంలో తేలింది. 51 పేస్ట్ బ్రాండ్లను పరీక్షించగా వీటిలో చాలా బ్రాండ్లలో సీసం, ఆర్సెనిక్, మెర్క్యురీ, కాడ్మియం వంటి హానికర రసాయనాలు ఉన్నాయి. ఇవి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. కాగా ఈ బ్రాండ్లన్నీ తమ పేస్టుల్లో ఎకో ఫ్రెండ్లీ వస్తువులు వాడుతున్నట్లు చెబుతున్నాయి.

error: Content is protected !!