News March 15, 2025

అర్ధరాత్రి కాజీపేటలో పోలీస్ పహారా

image

ప్రజల్లో భరోసా కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు పోలీసులు పహారా నిర్వహించారు. నేరాల నియంత్రణలో ప్రజలకు పోలీసులు ఉన్నారనే అనే ధైర్యాన్ని కలిగించడం కోసం అర్ధరాత్రి తనిఖీలు చేశారు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో పాటు, సాయుధ పోలీసులతో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ కాజీపేటలో పహారా కాశారు.

Similar News

News April 20, 2025

భీమదేవరపల్లిలో త్రికుటేశ్వర స్వామి ఆలయం!

image

కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించిన త్రికుటేశ్వర స్వామి ఆలయం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఉంది. ఈ ఆలయం హనుమకొండ వేయి స్తంభాల గుడి ఆకారాన్ని పోలి ఉంది. కాకతీయులు ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం భక్తుల దర్శనార్థం పునర్ నిర్మించబడింది. ఇక్కడ శివుడు త్రికుటేశ్వర రూపంలో మూడు దిక్కుల భక్తులకు దర్శనమిస్తారు.

News April 20, 2025

జిల్లాలో మంచిని సమస్య లేకుండా చూడండి: రాజనర్సింహ

image

జిల్లాలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడైనా మంచిది సమస్య ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.

News April 20, 2025

పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

image

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.

error: Content is protected !!