News January 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ASF కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు పథకాల జారీలో జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే పునరుద్ఘాటించారు. ప్రజల దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై అభిప్రాయ సేకరణ సర్వేకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం కొఠారి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీపీఓ భిక్షపతి, ఎంపీడీవో అంజాద్ పాషా పాల్గొన్నారు.
Similar News
News February 7, 2025
మాఘమాస వేళ భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు శుక్రవారం ఉదయం అభిషేకం నిర్వహించారు. నేడు మాఘమాసం శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News February 7, 2025
రెండో వన్డేలో విరాట్ ఆడతారా? గిల్ జవాబిదే

ఇంగ్లండ్తో జరిగిన తొలి ODIకి విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. మోకాలిలో వాపు కారణంగా ఆయన తప్పుకొన్నారు. మరి రెండో వన్డేలో ఆడతారా? ఈ ప్రశ్నకు బ్యాటర్ శుభ్మన్ గిల్ జవాబిచ్చారు. ‘సరిగ్గా మ్యాచ్ రోజు నిద్రలేచే సమయానికి విరాట్ మోకాలు వాచింది. దీంతో ముందు జాగ్రత్తగా తొలి వన్డే మ్యాచ్ నుంచి తప్పుకొన్నారు. అది పెద్ద గాయం కాదు. రెండో మ్యాచ్ కచ్చితంగా ఆడతారనుకుంటున్నాను’ అని తెలిపారు.
News February 7, 2025
బెల్లంపల్లి: రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కన్నాల బ్రిడ్జి కింద గుర్తు తెలియని రైలు బండికి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉన్నట్లు గుర్తించామని రైల్వే ASIమోహన్ రాథోడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..మృతురాలి వయసు(30) సుమారుగా ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.