News January 27, 2025
అర్హులకు 4 పథకాలను అందజేస్తాం: ASF కలెక్టర్

అర్హులందరికీ 4 ప్రభుత్వ పథకాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో పథకాలపై గ్రామసభలు నిర్వహించినట్లు చెప్పారు.
Similar News
News November 13, 2025
సాయిబాబాను ఎలా పూజించాలి?

సాయిబాబా పూజలో కఠిన నియమాలేం ఉండవు. ఉపవాసం చేసేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇతరులను దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆయన పూజలో భక్తే ప్రధానం. భక్తి లేని ఘనమైన పూజ కంటే, భక్తితో సమర్పించే ఓ పువ్వు కూడా బాబాకు సంతోషాన్నిస్తుంది. బాబాకు మన మనసనే పుష్పాన్ని సమర్పించినా చాలు. ఆయన పేరు తలచి, దానధర్మాలు చేస్తే సాయినాధుని అనుగ్రహం భక్తులపై తప్పక ఉంటుందట. <<-se>>#Pooja<<>>
News November 13, 2025
ఆలు కుదురూ చేను కుదురూ ఆనందం

“ఆలు”అంటే భార్య. “కుదురు” అంటే స్థిరత్వం లేదా సవ్యంగా ఉండటం. భార్యతో కలహాలు లేకుండా కుటుంబ జీవితం సజావుగా, సంతోషంగా, స్థిరంగా ఉన్నప్పుడూ.. చేను కుదురూ అంటే పొలం(ఆదాయ వనరులు) బాగుండి, ఆదాయం స్థిరంగా ఉన్నప్పుడే రైతు జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత లభిస్తాయని ఈ సామెత చెబుతుంది.
News November 13, 2025
రేపటి కోసం..

జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది EVMలు తేల్చనున్నాయి. అటు బిహార్లోనూ రేపు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాలపై ఆ రాష్ట్రంతో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.


