News January 23, 2025
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు: కలెక్టర్

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 16వ వార్డు సభలో మూడవ రోజు కొనసాగుతోన్న ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అర్హులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
VZM: ‘రైతుల ఖాతాల్లో రూ.150 కోట్లు జమ’

సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు జమ చేయనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 (సుఖీభవ రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2వేలు ) చొప్పున జమ అవుతుందని తెలిపారు.
News November 18, 2025
అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.
News November 18, 2025
రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు: మంత్రి తుమ్మల

తెలంగాణ ప్రభుత్వంతో జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ చర్చలు సఫలం అయ్యాయని, రాష్ట్రంలో తక్షణమే 83 కొనుగోలు కేంద్రాలలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిన్నింగ్ మిల్లుల డిమాండ్లను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పత్తి రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని మంత్రి ఈ సందర్భంగా కోరారు.


