News March 15, 2025
అర్హులైన ప్రతిఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్: రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కోసం పోరాడుతామని TUWJ(IJU) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు.శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల TUWJ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. విరాహత్ అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. డెస్క్ జర్నలిస్టులతో సహా అర్హులైన వారికి అందేలా కృషి చేస్తామన్నారు.
Similar News
News November 22, 2025
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమేనా?

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని సెంటర్లో బ్యానర్ కూడా పెట్టేశారు.
News November 22, 2025
మద్నూర్: బెడిసికొట్టిన ఇసుక స్మగ్లర్ల ‘కొత్త ప్లాన్’.. ఆరుగురి అరెస్ట్

మహారాష్ట్రకు ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురిని మద్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఆటకం కలగకుండా ఉండేందుకు చెక్ పోస్టులను దాటించేందుకు కొత్త తరహాలో ప్రయత్నించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 టిప్పర్ డ్రైవర్లు, 4 పైలట్ కార్ల యజమానులతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2 టిప్పర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
News November 22, 2025
వందల మందిని కాపాడే ఏఐ పరికరం.. అభినందించాల్సిందే!

హిమాచల్ ప్రదేశ్లో కొండ చరియలు విరిగిపడటం వల్ల ఎంతో మంది చనిపోతుంటారు. అలాంటి ప్రమాద మరణాలను తగ్గించేందుకు IIT మండికి చెందిన డా.కళా వెంకట ఉదయ్ టీమ్ అతి తక్కువ ఖర్చుతో AI వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది 90% పైగా కచ్చితత్వంతో 3 గంటల ముందుగానే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. దీని సెన్సార్లు భూమి కదలిక, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి ప్రమాదానికి ముందు అలర్ట్ చేస్తుంది.


