News March 15, 2025

అర్హులైన ప్రతిఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్: రాష్ట్ర అధ్యక్షుడు

image

రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కోసం పోరాడుతామని TUWJ(IJU) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తెలిపారు.శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల TUWJ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. విరాహత్ అలీ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. డెస్క్ జర్నలిస్టులతో సహా అర్హులైన వారికి అందేలా కృషి చేస్తామన్నారు.

Similar News

News April 10, 2026

HDFC వినియోగదారులకు అలర్ట్!

image

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.

News April 10, 2026

వరల్డ్ టాప్‌-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

image

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.

News April 10, 2026

వికారాబాద్: ఈనెల 13న నేషనల్ అప్రెంటిస్ మేళా

image

ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ ఏటీసీ ఐటీఐలలో నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్రబాబు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ఈనెల 13న ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుగుతుందన్నారు. ఈ మేళాలో వివిధ కంపెనీల యజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఐటీఐ చేసినవారు హాజరు కావొచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9177472488ను సంప్రదించవచ్చు.