News October 29, 2024
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు: మంత్రి దామోదర్

అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు. బోరంచలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. బీడు భూములు సస్యశ్యామలం చేస్తామని, గ్రావిటీ ద్వారా మనూరు, రేగోడ్ మండలాల్లో 3400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రధాన రహదారి వెంట 8KMకు ఒక PHC ఏర్పాటు చేస్తామని, మంజీరా బ్యాక్వాటర్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మెదక్: 30లోగా దరఖాస్తు చేసుకోండి!

2025-26 సంవత్సరానికిగాను జాతీయ యువత, కౌమార అభివృద్ధి కార్యక్రమం పథకం కింద గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం ఆన్లైన్ ప్రతిపాదనలను కోరుతున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రమేష్ సూచించారు. http://youth.yas.gov.in/scheme/npyad/ngo/login దరఖాస్తులు మాత్రమే అంగికరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News November 20, 2025
మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.


