News January 24, 2025
అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడో రోజు సభల్లో 978 మంది రైతు భరోసా, 6548 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 6,530 మంది కొత్త రేషన్ కార్డులు, 7,164 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
పెద్దపల్లి: బైక్ అదుపుతప్పి బాలిక మృతి

PDPL(D) పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలం బోట్లవనపర్తికి చెందిన కత్తెర్ల లక్ష్మణ్ తన భార్య, ఇద్దరు కూతుళ్లతో ఇంటికి వెళ్తున్న క్రమంలో కాసులపల్లి వద్ద బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో పెద్దకూతురు సాయిపావని(13) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
News November 17, 2025
నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’ ఇదే

విశ్వంలో శని గ్రహానికి అందమైన గ్రహంగా పేరుంది. దాని చుట్టూ ఉండే అందమైన వలయాలే దీనికి కారణం. ఆ వలయాలకు సంబంధించిన ఫొటోను నాసా ‘ఆస్ట్రానమీ పిక్చర్ ఆఫ్ ది డే’గా తన సైట్లో పేర్కొంది. కాసిని స్పేస్ క్రాఫ్ట్ 2004-2017 మధ్య సాటర్న్ చుట్టూ తిరుగుతూ రింగ్స్ను చిత్రీకరించింది. ఆ ఇమేజ్ల నుంచి పై ఫొటోను డిజిటల్గా క్రాప్ చేశారు. బ్లూ కలర్లో కనిపించేది రింగ్ ప్లేన్. డార్క్ షాడోస్లో ఉన్నవి వలయాల నీడలు.
News November 16, 2025
ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.


