News January 24, 2025

అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడో రోజు సభల్లో 978 మంది రైతు భరోసా, 6548 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 6,530 మంది కొత్త రేషన్ కార్డులు, 7,164 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమేనా?

image

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని
సెంటర్‌లో బ్యానర్ కూడా పెట్టేశారు.

News November 22, 2025

‘మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి’

image

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV)ను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టోర్ రూంలో ఆహార సామగ్రి, కోడిగుడ్లు, కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆమె ఆరా తీశారు. విద్యార్థులు పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.

News November 22, 2025

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమేనా?

image

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని సెంటర్‌లో బ్యానర్ కూడా పెట్టేశారు.