News March 5, 2025
అర్హుల ఎంపికను పూర్తి చేయాలి: హనుమకొండ కలెక్టర్

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకానికి జిల్లాలో ఎంతమంది ఎంపికయ్యారని, ఎన్ని దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చాయనే, తదితర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.
News November 17, 2025
కర్నూలు: కేంద్ర మంత్రి మనోహర్ లాల్కు ఘన స్వాగతం

కర్నూలు జిల్లా పర్యటన నిమిత్తం కేంద్ర విద్యుత్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం విచ్చేశారు. ఓర్వకల్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి గెస్ట్ హౌస్కు చేరుకొని జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


