News January 22, 2025

అర్హుల ఎంపిక కోసమే గ్రామసభ: ADB కలెక్టర్

image

అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలను ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఉట్నూరు మండలంలోని ఉమ్రి గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి నూతన దరఖాస్తులు స్వీకరిస్తున్నానని తెలిపారు అర్హులైన వారు గ్రామసభలో సమర్పిస్తే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

Similar News

News February 7, 2025

ఆదిలాబాద్: బొలెరో వాహనం ఢీ.. ముగ్గురికి గాయాలు

image

ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేష్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.

News February 7, 2025

మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఆశావాహుల చూపు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలలోని మున్సిపాలిటీలలో పాలకవర్గం పూర్తయిన నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను ఆధ్వర్యంలో పాలను కొనసాగుతుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలలో ఆశావాహులు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఒక వార్డుకు సుమారు ఐదుగురు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

News February 7, 2025

ఇంద్రవెల్లిలో మండలస్థాయి ప్రజావాణి

image

రాష్ట్రంలో మొట్టమొదటి సారి ప్రజావాణి కార్యక్రమం మండల స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభమైందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఇంద్రవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బహిరంగ విచారణ జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేదన్నారు. DRDA పీడీ రవీందర్, కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీహర్ష, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!