News March 19, 2025
అలంపూర్లో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గత 20 రోజుల క్రితం నిప్పంటించుకున్న వ్యక్తి కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నర్సింహులు ఆత్మహత్యకు యత్నించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వారు అతడిని వేధించారని, దీంతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 1, 2025
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత లడ్డూ ప్రసాదం

శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకం ప్రారంభం కానుంది. అతిశీఘ్ర దర్శనం (రూ.300) టికెట్ కొనుగోలు చేసిన వారికి ఒక లడ్డూను, స్వామివారి స్పర్శ దర్శనం (రూ.500) టికెట్ దారులకు రెండు లడ్డూలను ఉచితంగా అందజేస్తారు. అలాగే, డొనేషన్ కౌంటర్, ఛైర్మన్ ఛాంబర్, కైలాస కంకణాల కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, శ్రీగోకులం ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేయనున్నారు.
News December 1, 2025
నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.


