News March 3, 2025

అలంపూర్‌లో 39.0°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. సాధారణం కంటే గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మార్చి నెల ఆరంభంలోనే సాధారణం కంటే 2, 3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న 3 నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత 24 గంటల్లో అలంపూర్‌లో 39.0°C, మల్దకల్‌లో 38.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News September 17, 2025

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్లు భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బలగ పోతయ్య తెలిపారు. ఈనెల 27లోగా iti.ap.gov.in వెబ్సైట్‌లో టెన్త్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు 28న సర్టిఫికేట్స్ వేరిఫికేషన్‌కు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అన్ని పత్రాలతో రావాలన్నారు. >Share it

News September 17, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

image

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.

News September 17, 2025

నాయకులారా చూడండి.. ఇదీ ఆదిలాబాద్‌లో పరిస్థితి..!

image

నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజంటూ అన్ని పార్టీల నాయకులు, అధికారులు గొప్పగా ఉత్సవాలు చేసుకున్నారు. కానీ ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న దానికి ఈ ఘటనే నిదర్శనం. ఉట్నూర్(M) సుంగు మత్తడిగూడ వాసి కుమ్ర పారుబాయి(45) అనారోగ్యంతో చనిపోయింది. ఆ ఊరిలో బ్రిడ్జి లేక వాగులో ఒకరినొకరు పట్టుకుని ఈరోజు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.