News March 21, 2024

అలంపూర్ ఆలయాల హుండీలు గలగల..!

image

అలంపూర్‌లో వెలసిన జోగులాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల హుండీ లెక్కింపు నేడు జరగ్గా.. మొత్తం రూ.45,18,974 లు భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. జోగులాంబ హుండీలో రూ.35,75,710 లు, అలాగే బాల బ్రహ్మేశ్వర స్వామి హుండీలో రూ.5,81,150, అన్నదానం సత్రం హుండీలో రూ.62,123 వచ్చాయి. విదేశీ కరెన్సీతో పాటు 47 గ్రాముల మిశ్రమ బంగారం, 397 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో పురందర్ కుమార్ తెలిపారు.

Similar News

News November 14, 2025

కురుమూర్తి స్వామి ఆలయంలో కోడెల వేలం

image

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం 2025 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన 18 కోడెదూడల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.1,17,000 ఆదాయం లభించింది. ఈ విషయాన్ని ఆలయ పాలకమండలి ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సభ్యులు భాస్కరాచారి, కమలాకర్ పాల్గొన్నారు.

News November 13, 2025

MBNR: U-14 క్రికెట్.. 150 మంది హాజరు

image

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలురకు క్రికెట్ ఎంపికలు MDCA స్టేడియంలో నిర్వహించారు. SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైనా వారిని ఈ నెల 15న నారాయణపేటలో జరిగే ఎంపికలలో పంపిస్తామన్నారు. పీడీలు వేణుగోపాల్, అబ్దుల్లా, మోహినుద్దీన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2025

పాలమూరు: జాబ్ మేళా..70 మంది హాజరు

image

మహబూబ్ నగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో ఇవాళ మినీ జాబ్ మేళా నిర్వహించామని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ Way2Newsతో తెలిపారు. 5 ప్రైవేట్ సంస్థలలో మొత్తం 385 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 70 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు.