News February 14, 2025

అలంపూర్: దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ప్రధాన అర్చకులు

image

హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ పరిధికి చెందిన జోగులాంబ ఆలయం ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అర్చకులు తెలిపారు.

Similar News

News November 20, 2025

GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్.. మూసాపేట్ కార్పొరేటర్ ARREST

image

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట్ డివిజన్‌కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని, డివిజన్‌లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్ట్ చేశారని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ తెలిపారు. డివిజన్‌లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు.

News November 20, 2025

జగిత్యాల: నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలి: కలెక్టర్

image

మల్లాపూర్ మండలం రాఘవపేట, ఓబులాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ధాన్యం తూకం, తేమశాతం, రసీదుల జారీ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా కొనుగోళ్లు జరగాలని ఆయన ఆదేశించారు. అధికారులు నిరంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ సెంటర్ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. RDO, DCO, MRO పాల్గొన్నారు.

News November 20, 2025

GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్.. మూసాపేట్ కార్పొరేటర్ ARREST

image

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట్ డివిజన్‌కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని, డివిజన్‌లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్ట్ చేశారని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ తెలిపారు. డివిజన్‌లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు.