News April 16, 2025
అలంపూర్: రూ.400 కోట్లతో మాస్టర్ ప్లాన్

అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.450 కోట్లతో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తుల రాక మార్గానికి సుగమం చేస్తూ దివ్యానుభూతి పొందే వాతావరణాన్ని తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ ప్రణాళికకు ఆలయ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రాము, విశ్వనాథ్, గోపాల్, జగదీశ్ నాయుడు ఉన్నారు.
Similar News
News April 20, 2025
నా పేరు తొలగింపుపై కోర్టుకెళ్తా: అజారుద్దీన్

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ HCA అంబుడ్స్మన్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇండియా జట్టుకు 10ఏళ్లు కెప్టెన్గా ఉన్న వ్యక్తి <<16150970>>పేరు తొలగించమనటం<<>> సిగ్గుచేటని అన్నారు. తానేమి మూర్ఖుడని కాదని, స్టాండ్కు పేరు పెట్టె సమయానికే తన పదవీకాలం ముగిసిందని పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో పాల్గొననందుకే కొంతమంది అధికారులు తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 20, 2025
రేపు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు

USA ఉపాధ్యక్షుడు JD వాన్స్ రేపటి నుంచి భారత్లో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా ఈ నెల 24 వరకు పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. రేపు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో దిగనున్న ఆయనకు క్యాబినెట్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఢిల్లీలోని అక్షర్ధామ్, చేనేత ఉత్పత్తుల దుకాణాలు సందర్శించనున్నారు. సా.6.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై వాన్స్ చర్చిస్తారు.
News April 20, 2025
‘చట్టాలన్ని ఆడవారికే’ .. భార్య టార్చర్తో భర్త సూసైడ్

భార్య వేధింపులు తాళలేక యూపీలో మోహిత్ కుమార్ అనే ఫీల్డ్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్తినంతా భార్య వారి కుటుంబసభ్యుల పేరు మీదకు మార్చాలని, లేకుంటే తనపై వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించిందని తెలిపారు. ప్రస్తుతమున్న చట్టాలన్నీఆడవారికే అనుకూలంగా ఉన్నాయని, మగవారిని రక్షించేలా చట్టాలుంటే తాను ఈ నిర్ణయం తీసుకునే వాడిని కాదని వీడియో రికార్డు చేసి ప్రాణాలు వదిలారు.