News April 15, 2025
అలంపూర్: లబ్ధిదారుల వెరిఫికేషన్ను పూర్తి చేయాలని వినతి

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్కు వినతి పత్రాన్ని అందించారు. అలంపూర్, ఉండవల్లి, అయిజ, గద్వాల, ధరూర్ మండలాలతో పాటు ఇతర మండలాల నుంచి భారీగా దరఖాస్తులు ఉన్నాయని అధికారులకు విన్నవించారు. ఆయన వెంట దేవదాసు, నరసింహ ఇతరులు పాల్గొన్నారు.
Similar News
News November 9, 2025
లారీ ఢీకొని యువకుడు మృతి

బైక్పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన భట్టిప్రోలు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. రేపల్లె – గూడవల్లికి బైక్పై వెళ్తున్న మహమ్మద్ వలి (27) ని అదే దారిలో వస్తున్న లారీ సూరేపల్లి బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో వలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 9, 2025
జాతీయస్థాయి స్విమ్మింగ్కు హర్షవర్ధన్ రాజు ఎంపిక

విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తెనపల్లి ప్రగతి కళాశాల విద్యార్థి బి. హర్షవర్ధన్ రాజు స్వర్ణం, కాంస్యం పతకాలు సాధించాడు. ఈ ప్రతిభతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఢిల్లీలో జరగనున్న 69వ నేషనల్ గేమ్స్కు అతడు ఎంపికయ్యాడు. విజయం సాధించిన హర్షవర్ధన్ రాజును కళాశాల యాజమాన్యం అభినందించింది.
News November 9, 2025
టీ20 WC వేదికలు ఖరారు?

ICC మెన్స్ T20 వరల్డ్ కప్-2026 వేదికలు ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో, కాండీలో మ్యాచులు జరగనున్నట్లు Cricbuzz పేర్కొంది. అహ్మదాబాద్, కోల్కతాలో సెమీ ఫైనల్స్ జరుగుతాయని, ఫైనల్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. SL లేదా PAK ఫైనల్ చేరితే కొలంబోలో ఫైనల్ జరిగే అవకాశముంది. FEB 7న టోర్నీ ప్రారంభమయ్యే ఛాన్సుంది.


