News January 27, 2025

అలాంటి వారి సమాచారం ఇవ్వండి: ఏసీపీ

image

విజయవాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని ఏసీపీ దామోదర్ పిలుపునిచ్చారు. ఎవరైనా తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి తీసుకున్నా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలు నియంత్రణలో ప్రజలు భాగస్వాములైనప్పుడే నేరాలను అరికట్టవచ్చని సూచించారు. బ్లేడు గంజాయి బ్యాచ్‌పై ఉక్కు పాదం మోపుతున్నామని, వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఏసీపీ తెలిపారు.

Similar News

News December 4, 2025

పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్‌పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్‌తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్‌ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.

News December 4, 2025

HYD: DEC 16న అథ్లెటిక్స్ MEET

image

డిసెంబర్ 16న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్ 2025 జరగనుంది. ఉ. 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో 4- 20 ఏళ్లలోపు బాలలు, బాలికలు పాల్గొనవచ్చు. స్ప్రింట్, రన్నింగ్, లాంగ్ జంప్ ఉంటాయి. ఆసక్తి గలవారు https://forms.gle/ouD9qXh9QTyAY7R47 రిజిస్టర్ చేసుకోవాలని. మిగతా వివరాలకు 99630 48320, 99590 91114‌లలో సంప్రదించండి.

News December 4, 2025

అన్నమయ్య: రైలు పట్టాలపై యువకుల మృతి

image

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు తిరుపతి-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలట్ మదనపల్లె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు సోమల(M) ఇరికిపెంటకు చెందిన ముని కుమార్, కలికిరి(M) ఆచార్ల కొత్తపల్లికి చెందిన వీర భద్రయ్యగా గుర్తించారు. సెంట్రల్ ట్రాక్‌పై కూర్చొని మద్యం తాగుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో చనిపోయారని సమాచారం.