News March 17, 2025
అలా చేస్తే కఠిన చర్యలే: బాపట్ల డీఈవో

టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం తెలిపారు. జిల్లాలో 16,799 మంది విద్యార్థులు నేటి నుంచి మార్చి28వ తేదీ వరకు పరీక్షలు రాయనున్నారన్నారు. అలాగే జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
Similar News
News September 14, 2025
యాదాద్రి భక్తుల సౌకర్యార్థం కియోస్క్ యంత్రాలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆరు కియోస్క్ యంత్రాలను ఈవో వెంకట్రావు ప్రారంభించారు. కెనరా బ్యాంక్ విరాళంగా అందించిన ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిలబడకుండానే దర్శనం, ప్రసాదాలు, వ్రతాల టికెట్లను డిజిటల్ పద్ధతిలో నేరుగా పొందవచ్చు. ఈ డిజిటల్ సేవలతో భక్తుల సమయం ఆదా అవడంతో పాటు, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
News September 14, 2025
గురుభట్లగూడెంలో జ్వరంతో వ్యక్తి మృతి

చింతలపూడిలోని గురుభట్లగూడేనికి చెందిన చక్రపువాసు (60) జ్వరంతో మృతి చెందారు. 20 రోజుల నుంచి జ్వరం తీవ్రమై కాలేయం, ఇతర అవయవాలు దెబ్బతిన్నాయి. తీవ్రమైన రక్తహీనత రావడంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలియడంతో ఆదివారం AMC మాజీ ఛైర్మన్ ముత్తారెడ్డి, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు గుత్తావేంకటేశ్వరరావు నివాళులు అర్పించారు.
News September 14, 2025
విజయవాడ: డయేరియా వైద్య శిబిరం వద్ద భారీగా వైద్యులు

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా వైద్య శిబిరం మొత్తం భారీ స్థాయిలో వైద్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 మంది వైద్యులు, ముగ్గురు ప్రత్యేక వైద్యులు, ముగ్గురు రాపిడ్ టెస్టింగ్ వైద్యులు, 36 మంది నర్సులు, 60 మంది ఆశా కార్యకర్తలను శిబిరం వద్ద విధుల నిమిత్తం కేటాయించింది. వీరిలో వైద్యులు నర్సులు ఆశా కార్యకర్తలు 20 బృందాలు ఏర్పడి న్యూ ఆర్ఆర్ పేటలోని ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు.