News March 17, 2025
అలా చేస్తే కఠిన చర్యలే: బాపట్ల డీఈవో

టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం తెలిపారు. జిల్లాలో 16,799 మంది విద్యార్థులు నేటి నుంచి మార్చి28వ తేదీ వరకు పరీక్షలు రాయనున్నారన్నారు. అలాగే జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.
Similar News
News October 14, 2025
“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.
News October 14, 2025
NGKL: ‘పోలీస్ అమరవీరుల’ దినోత్సవం.. వ్యాసరచన పోటీలు

అక్టోబరు 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు.
News October 14, 2025
వరంగల్ నిట్లో ఆయారే టెక్నోజియాన్

వరంగల్ నిట్లో సాంకేతిక సంబరం టెక్నీజియాన్-2025 ప్రారంభం కానుంది. ఈనెల 24, 25వ తేదీల్లో నిట్లో టెక్నోజియాన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.2,00,000 విలువైన బహుమతి నిధితో పాటు, రెండు రోజులపాటు ఉత్సాహభరితమైన పోటీలు, సాంకేతిక ప్రదర్శనలు, విభిన్న ఈవెంట్లతో నిండి ఉండే ఈ ఉత్సవం, సాంకేతిక పురోగతిని వేడుకగా జరుపుకునే వేదికగా నిలవనుంది.