News June 6, 2024

అలిపిరి బస్టాండు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

తిరుపతిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ గుంతలో పడి మృతి చెందినట్లు అలిపిరి SI రామస్వామి తెలిపారు. అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ కోసం తీసిన గోతిలో పడ్డాడు. ఎవరు చూడకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రుయాలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News October 23, 2025

మేయర్ దంపతుల హత్య కేసులో రేపు తీర్పు

image

రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యపై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 21 మంది నిందితులు 122 మంది సాక్షుల విచారణ కోర్టు పూర్తి చేసింది. 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టు వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

News October 23, 2025

చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777

News October 22, 2025

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

image

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.