News October 8, 2024

అలిపిరి మెట్ల మార్గంలో గుండెపోటుతో భక్తుడు మృతి

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఓ భక్తుడు మృతి చెందిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. నాగలాపురం మండలం రెడ్డి వీధికి చెందిన సుబ్రహ్మణ్యం (65), తన భార్య లత మరో 15 మంది భక్తులతో కలిసి శనివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. సోమవారం ఉదయం అలిపిరి మెట్ల మార్గంలో కొండను ఎక్కుతుండగా 2400 మెట్టు వద్ద ఫిట్స్ వచ్చి కిందపడి పోయాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News January 4, 2026

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి.
☞ పుంగనూరులో మొదటి రకం “10 కిలోల” బాక్స్ ధర గరిష్ఠంగా రూ.367, కనిష్ఠ ధర రూ.234
☞ పలమనేరులో గరిష్ఠ ధర రూ. 450, కనిష్ఠ ధర రూ.370
☞వీకోట గరిష్ఠ ధర రూ.420, కనిష్ఠ ధర రూ. 360
☞ కలికిరి గరిష్ఠ ధర రూ.400, కనిష్ఠ ధర రూ. 370
☞ ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.450, కనిష్ఠ ధర రూ. 350 వరకు పలుకుతోంది.

News January 4, 2026

చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

image

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.

News January 4, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.178 నుంచి రూ.187, మాంసం రూ.258 నుంచి 285 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.294 నుంచి రూ.310 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 96 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.