News May 25, 2024
అలిపిరి శ్రీవారి మెట్ల వద్ద బాలుడి మిస్సింగ్

పచ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ కుటుంబం శనివారం శ్రీవారి దర్శనార్థం అలిపిరి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. అలిపిరి కాలిబాట మొదలయ్యేటప్పుడు ఆ కుటుంబానికి చెందిన 6 సంవత్సరాల బాలుడు మిస్సైయాడు. దీంతో టీటీడీ విజిలెన్స్ & పోలీసు అధికారులని సంప్రదించగా వారు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Similar News
News February 19, 2025
చిత్తూరు జిల్లాలో TODAY TOP NEWS

✒ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు
✒ డాక్టర్లకు చిత్తూరు కలెక్టర్ వార్నింగ్
✒ పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
✒ పెనుమూరు: MLA హామీ.. తప్పిన ప్రమాదం
✒ పలమనేరు: బాలిక మృతి కేసులో డీఎస్పీ విచారణ
✒ తవణంపల్లి మండలంలో ముగ్గురి అరెస్ట్
✒ బూతులతో రెచ్చిపోయిన టీటీడీ బోర్డు సభ్యుడు
News February 19, 2025
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక

ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు పులిచెర్ల మండలం కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం శ్రీవాణి తెలిపారు. షాహిస్తా తబుసం, యశ్రబ్ స్కాలర్షిప్కు ఎంపికైనట్టు ఆమె వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్లో నిర్వహించిన పరీక్షకు పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది.
News February 19, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

చిత్తూరు జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.