News December 18, 2024
అల్పపీడన ప్రభావం.. సిక్కోలుకు భారీ వర్షసూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చలితీవ్రత అధికమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో అలజడి మొదలవగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 14, 2026
SKLM: రేపే ఇంటర్ ఫలితాలు.. 39,838 మంది విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాలు రేపు ఉ.10:30కి విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఫస్ట్ ఇయర్ 19,850 మంది, సెకండ్ ఇయర్ 19,988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితం ఎలా ఉన్నా.. ధైర్యంతో ఉంటే ఎన్నో విజయాలను సాధించవచ్చని టీచర్స్, పేరెంట్స్ విద్యార్థులకు అవగాహన కల్పించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫలితాలను అందరికంటే ముందుగా, వేగంగా, సులభంగా Way2Newsలో చెక్ చేసుకోవచ్చు.
#Share It..
News April 14, 2026
మహిళలే నేటి మహారాణులు: మంత్రి అచ్చెన్నాయుడు

మహిళలే నేటి మహారాణులని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఆటోలను మహిళలకు అందజేశారు. నేడు మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News April 14, 2026
శ్రీకాకుళం జిల్లాలో 35 ఏళ్ల యువకుడు సూసైడ్

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడియా రామారావు(35) మంగళవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మందస, సోంపేట మండలాల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా మృతుడు ఉన్నాడు.


