News March 31, 2025

అల్లవరం: కారులో నుంచి దిగి వారధి పైనుంచి దూకిన వ్యక్తి

image

అల్లవరం మండలం బోడసకుర్రు మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్‌లో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేసాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీనితో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 12, 2025

SBIలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

image

<>SBI<<>> 5కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA/MS/PGDBM/PGDBA ఫైనాన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in

News November 12, 2025

సూర్యాపేట: బయటపడ్డ కాకతీయ కాలం నాటి శివలింగం

image

తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలో 11వ శతాబ్దం నాటి కాకతీయుల కాలం నాటి శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అది సోమసూత్ర శివలింగమని గ్రామస్థులు తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ శివాలయం పక్కనే అనంతారం గ్రామం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో శివభక్తులు పాల్గొని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు.

News November 12, 2025

మొంథా తుఫాన్ నష్టం.. ఉమ్మడి జిల్లాకు నిధుల విడుదల

image

మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 20, 30న కురిసిన వర్షాలతో వరంగల్, హనుమకొండ నగరాలు జలమయమయ్యాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలు సందర్శించి బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం రూ.12.68 కోట్లు విడుదల చేసింది. పత్తి, వరి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతినగా, రైతులు పంట నష్ట పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.