News March 31, 2025

అల్లవరం: కారులో నుంచి దిగి వారధి పైనుంచి దూకిన వ్యక్తి

image

అల్లవరం మండలం బోడసకుర్రు మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్‌లో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేసాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీనితో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 5, 2025

సిరిసిల్ల: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్టాఫ్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ MLHPలతో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సకాలంలో లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు.

News December 5, 2025

రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్‌ను ఫోర్స్ చేయలేదు: CBN

image

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.

News December 5, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌.. రూ. 5.91 కోట్ల దుబారా!

image

NOVలో జరిగిన జూబ్లీ బైపోల్ నిర్వహణకు రూ.5.91 కోట్లు ఖర్చు చేసినట్లు RTI ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిపై FGG అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త సిబ్బంది, వాహనాలు, పారామిలటరీ బలగాలు లేకుండా ప్రశాంతమైన జూబ్లీహిల్స్‌లో ఇంత భారీ ఖర్చు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా జరిగిందని, వెంటనే ఖర్చుపై ఆడిట్ నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని FGG ECకి విజ్ఞప్తి చేసింది.