News April 8, 2025

అల్లవరం: తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక వివాహిత సూసైడ్

image

10 నెలల క్రితం పెళ్లయిన అల్లవరం మండలం తూర్పులంకకు చెందిన ప్రవీణ (27) తల్లితండ్రులను విడిచి గుజరాత్ వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రవీణ నెల రోజుల క్రితం గుజరాత్‌లో ఉంటున్న భర్త వద్ద నుంచి స్వగ్రామం వచ్చింది. కోలుకున్న ఆమె మళ్లీ గుజరాత్ వెళ్లడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

Similar News

News September 16, 2025

హైదరాబాద్‌లో వర్షాల తీరిదే..!

image

HYDలో ఏడాదిలో కురుస్తున్న వర్షాల తీరు పరిశీలిస్తే ‘కురిస్తే కుంభవృష్టి.. లేదంటే అనావృష్టి’ అన్నట్లుగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షం ప్రారంభమైన గంట వ్యవధిలోనే 15 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారిగా కురుస్తోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీంతో ఒకే చోట వరదలు ముంచెత్తి, ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News September 16, 2025

DSC: జిల్లాలో మిగిలిపోయిన 56 పోస్టులు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక జిల్లాలో 56 పోస్టులు మిగిలాయి.

News September 16, 2025

పార్వతీపురం: నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ

image

నేటి నుంచి వాహనమిత్ర దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల్లో స్వీకరించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్హత పొందిన వారికి ఈ పథకం కింద ప్రభుత్వం రూ.15వేలు ఆర్థిక సాయం అందజేయనుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఏపీలో రిజిస్టర్ కాబడిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ డ్రైవర్లు అర్హులన్నారు.