News April 9, 2025
అల్లవరం: తీరంలో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు

అల్పపీడనం కారణంగా అల్లవరం మండల పరిధిలోని సముద్ర తీర గ్రామాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. రెండు రోజుల నుంచి అలల ప్రభావం తీవ్రంగా ఉందని స్థానిక మత్స్యకారులు మంగళవారం తెలిపారు. ఓడలరేవు, నక్కా రామేశ్వరం, కొమరగిరిపట్నం గ్రామాల్లో అలల తీవ్రత అధికంగా ఉంది. అలల ప్రభావంతో సముద్ర తీరంలో నది కోత తీవ్రమైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్పపీడనం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.
Similar News
News November 25, 2025
రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు

AP: రాష్ట్రంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం (రంపచోడవరం కేంద్రం) జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
News November 25, 2025
STRANGE: ఈ ఆలయం గురించి తెలుసా?

అభిమాన హీరోలకు గుడులు కట్టడం చూస్తుంటాం. అయితే బైక్కు గుడి కట్టి పూజించే ఆలయం ఒకటుంది. బుల్లెట్ బాబా ఆలయం రాజస్థాన్లోని జోధ్పూర్-పాలీ హైవేపై ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్(RNJ 7773) బైక్ను దేవుడిగా పూజిస్తారు. 1988లో యాక్సిడెంట్లో ఓం సింగ్ చనిపోగా.. బైక్ను వేరే చోటుకు తీసుకెళ్లినా మళ్లీ అక్కడికే వచ్చింది. సురక్షిత ప్రయాణం కోసం ఈ బైక్ను పూజిస్తారు. దీనిపై ‘DUG DUG’ అనే మూవీ వచ్చింది.
News November 25, 2025
GOOD NEWS.. HYDకు రూ.300 కోట్లు

GHMCకి ప్రభుత్వం శుభవార్త చెప్పంది. 150 డివిజన్లకు రూ.300 కోట్లు ప్రకటించినట్లు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో GHMC ఎలక్షన్స్ రానున్నాయని, ఈ లోపు పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. మొదట సీఎం 150 డివిజన్లకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తామన్నారన్నారు. అవి సరిపోవని చెప్పడంతో మరో రూ.150కోట్లు కేటాయించారని స్పష్టంచేశారు.


