News March 31, 2025

అల్లవరం: బ్రిడ్జి పైనుంచి దూకేసిన వ్యక్తి గల్లంతు

image

అల్లవరం మండలం బోడసకుర్రు- పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి ఓ కారులో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేశాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీంతో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 3, 2026

వరి ఉత్పత్తిలో చైనాను దాటేసిన భారత్.. ఎలా సాధ్యమైందంటే?

image

చైనా ఆధిపత్యానికి బ్రేక్ వేస్తూ 152 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే No.1 స్థానానికి చేరింది. చైనాను దాటేయడంలో.. తైవాన్ ఇచ్చిన పొట్టి రకం (TN1) విత్తనాలు మన సాగును మలుపు తిప్పాయి. వీటికి తోడు IR-8, మన దేశీ రకం ‘జయ’ రాకతో ఉత్పత్తి భారీగా పెరిగింది. ఈ రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడగలిగాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలకు రైతుల కష్టం తోడవ్వడంతో భారత్ ‘రైస్ కింగ్’గా అవతరించింది.

News January 3, 2026

కామారెడ్డి: వేడెక్కిన ‘మున్సిపోల్’

image

కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమికంగా ఓటర్ల లిస్ట్ విడుదల చేసిన అధికారులు అభ్యంతరాలకు గడువు విధించారు. ఈ నెల 10న జిల్లా అధికారులు తుది ఓటర్ల జాబితా ప్రకటించనుండగా పోటీచేసే అభ్యర్థులు ఆయా వార్డుల్లో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయో, లేదోనని వేచి చూస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది.

News January 3, 2026

వికారాబాద్: అక్కడ 365 రోజులు సంక్రాంతి!

image

సాధారణంగా సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెడుతారు. కానీ, ఆ ప్రాంతానికి వెళితే 365 రోజులు సంక్రాంతిలా అనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ తండా ప్రజలు ప్రతిరోజు తమ ఇంటి ముందు ముగ్గు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మపై పువ్వు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరం మొత్తం ఇలా చేయడం ఈ తండా వాసుల ప్రత్యేకత. ఏళ్ల ఆచారాన్ని ఇలా కొనసాగిస్తున్నారు.