News January 31, 2025

అల్లవరం: సాప్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యం

image

అల్లవరం మండలం బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మలికిపురం(M) రామరాజులంకకు చెందిన జవ్వాది కృపాకిరణ్(25) విప్రోలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చెన్నైలో జాబ్ చేసే అతను ఇటీవల ఇంటికి వచ్చాడు. ఏమి జరిగిందో ఏమోగానీ మంగళవారం బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. అతని మృతదేహం గురువారం లభ్యమైంది. వ్యక్తిగత సమస్యలే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News December 3, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

⋆ రేపు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఉ.11 గంటలకు YS జగన్‌ ప్రెస్ మీట్‌
⋆ శ్రీశైలంలో ఈ నెల 7 వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం రద్దు.. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం
⋆ వైఎస్ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని సునీత వేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన CBI కోర్టు.. ఈ నెల 10న తీర్పు
⋆ ఈ నెల 23న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు

News December 3, 2025

అల్లూరి: అత్తను హత్య చేసిన కోడలికి జైలు

image

రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కె. జ్యోతికి బుధవారం రంపచోడవరం మేజిస్ట్రేట్ కోర్టు 7 ఏళ్లు జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. 2024లో నిందితురాలు తన అత్త లక్ష్మిని కర్రతో కొట్టి దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి మృతి చెందింది. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు వివరించారు.

News December 3, 2025

NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

image

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్  నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.