News January 31, 2025
అల్లవరం: సాప్ట్వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యం

అల్లవరం మండలం బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మలికిపురం(M) రామరాజులంకకు చెందిన జవ్వాది కృపాకిరణ్(25) విప్రోలో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. చెన్నైలో జాబ్ చేసే అతను ఇటీవల ఇంటికి వచ్చాడు. ఏమి జరిగిందో ఏమోగానీ మంగళవారం బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. అతని మృతదేహం గురువారం లభ్యమైంది. వ్యక్తిగత సమస్యలే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ విజన్.. ఆర్థిక లక్ష్యాలు ఇవే!

*రాష్ట్ర సుదీర్ఘకాల ఆర్థిక ప్రణాళికనే ఫ్యూచర్ సిటీ
*విజన్-2047 ద్వారా $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం
*దేశంలో మొదటి నెట్-జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ
*FCDA ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలు
ఇన్నోవేషన్, పారిశ్రామిక హబ్లు BFCలో కీలకం. AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఫిన్టెక్, ఎలక్ట్రానిక్స్ తయారీతో పాటు వేలాది మంది ఉపాధి. 30K ఎకరాలను నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వినోద, Green జోన్లుగా విభజించారు.
News December 7, 2025
తిరుపతి: వారిపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయా..?

NSUలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అ.ప్రొఫెసర్లు మాజీ VC మురళీధర్ శర్మ హయాంలో విధుల్లో చేరారు. వీరిలో లక్ష్మణ్(మహారాష్ట్ర), శేఖర్ రెడ్డి (AP)కి చెందిన వారు. లక్ష్మణ్పై గతంలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయట. మరి ఇలాంటి వ్యక్తి ఏమి చేయలేదంటే ఎలా నమ్ముతారన్నది కొందరి వాదన. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వర్సిటీ అధికారులదే.
News December 7, 2025
తిరుపతి: మరో ప్రొఫెసర్ది అదే డిపార్ట్మెంట్.!

తిరుపతి NSUలో యువతిపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. వీడియో తీసి బెదిరింపులకు దిగినట్లు ఆరోపిస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే విభాగానికి చెందిన శేఖర్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది. అతను ‘నాకు సంబంధం లేకుండా నా పేరు తెచ్చారు’ అని సిబ్బందితో మట్లాడినట్లు సమాచారం.


