News February 14, 2025

అల్లాదుర్గం: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

అల్లాదుర్గం మండలం సీతానగర్ గ్రామ శివారులో రోడ్డు పక్క అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కాగితంపల్లి గ్రామానికి చెందిన ముసిరిగారి మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. మల్లయ్య కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

Similar News

News October 18, 2025

‘మలబార్’కు పాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ కష్టాలు

image

ధంతేరాస్ వేళ మలబార్ గోల్డ్&డైమండ్స్‌ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ కంపెనీ లండన్‌లో తమ షోరూమ్ ఓపెనింగ్‌కు UK బేస్డ్ పాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ అలిష్బా ఖాలీద్‌తో కొలాబరేట్ కావడమే అందుక్కారణం. గతంలో ఆమె Op సిందూర్‌ను ‘పిరికి చర్య’గా అభివర్ణించారు. దీంతో మలబార్ యాజమాన్యం పాక్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తోందని నెటిజన్లు SMలో పోస్టులు పెట్టారు. సంస్థ బాంబే కోర్టుకెళ్లగా అలాంటి పోస్టులు తొలగించాలని ఆదేశించింది.

News October 18, 2025

దీపావళిని భద్రతతో జరుపుకోవాలి: కలెక్టర్

image

దీపావళి పండుగ సందర్భంగా జాగ్రత్త చర్యలు, భద్రతతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు పెద్దలు తప్పకుండా పర్యవేక్షించాలని అన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

News October 18, 2025

HYD: రెహమాన్‌పై మూడో కేసు నమోదు

image

జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న రెహమాన్‌పై <<17999949>>మరిన్ని కేసులు నమోదయ్యే<<>> అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ బాలల సదనంలో గతంలో మరో బాలుడిపై అతడు లైంగిక దాడి చేసినట్లు సైదాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా మరో 10 మంది బాలలపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోలీసులు మూడో కేసు నమోదు చేశారు.