News July 22, 2024

అల్లాదుర్గం: విద్యుత్ షాక్‌తో లైన్‌‌మెన్ మృతి

image

అల్లాదుర్గం మండలంలో విద్యుత్ షాక్‌తో లైన్‌‌మెన్ గణేశ్(24) మృతి చెందాడు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గణేశ్ రెడ్డిపల్లి, వెంకట్రావుపేటలో లైన్‌‌మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అల్లాదుర్గం హెల్పర్ రామకృష్ణతో కలిసి స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు వేసే క్రమంలో షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

News December 4, 2025

మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.

News December 4, 2025

మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.