News July 22, 2024

అల్లాదుర్గం: విద్యుత్ షాక్‌తో లైన్‌‌మెన్ మృతి

image

అల్లాదుర్గం మండలంలో విద్యుత్ షాక్‌తో లైన్‌‌మెన్ గణేశ్(24) మృతి చెందాడు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గణేశ్ రెడ్డిపల్లి, వెంకట్రావుపేటలో లైన్‌‌మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అల్లాదుర్గం హెల్పర్ రామకృష్ణతో కలిసి స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజు వేసే క్రమంలో షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News December 1, 2025

మెదక్: ఈరోజే మంచి రోజు.. అత్యధిక నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మెదక్, తూప్రాన్ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి వరకు అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు ఏకాదశి, మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో ద్వాదశి కారణంగా నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈరోజే అధికంగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది.

News December 1, 2025

మెదక్: ఏకగ్రీవం దిశగా మల్కాపూర్ తండా పంచాయతీ

image

మెదక్ మండలం మల్కాపూర్ తండాలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2019లో జరిగిన ఎన్నికల్లో సైతం ఏకగ్రీవం చేశారు. మొదటి సర్పంచ్ గా సరోజను ఎన్నుకున్నారు. ఈసారి దారావత్ బన్సీని ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో మల్లన్నగుట్ట తండా నుంచి సరోజ ఉండగా ఈసారి మల్కాపూర్ తండా నుంచి బన్సీ సర్పంచ్ కానున్నట్లు సమాచారం.

News December 1, 2025

MDK: తహశీల్దార్ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పబ్లిక్ మీటింగ్‌లు, ర్యాలీలు, మైక్‌లకు తహశీల్దార్ అనుమతి తప్పనిసరన్నారు. పోలింగ్‌కు 44 గంటల ముందు సభలు, ఊరేగింపులు నిషేధమని, లౌడ్‌స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమేన్నారు. సర్పంచ్ అభ్యర్థులకు ఒక్క వాహనం అనుమతి ఉందన్నారు.