News March 29, 2025
అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: CM రేవంత్

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో అల్లాను కొలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన “రంజాన్ ఇఫ్తార్ విందు”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News November 26, 2025
MBNR: పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ ప్రతిజ్ఞ

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ రోజు రాజ్యాంగ ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉంచిందని, పోలీసు శాఖ ప్రజల హక్కులను కాపాడుతూ, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
News November 26, 2025
మహబూబ్నగర్: మొదటి విడత ఎన్నికలు జరిగేవి ఇక్కడే

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతే తెలిసింది. జిల్లాలో మొదటి విడతలో 139 గ్రామపంచాయతీలకు, 1188 వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఎలక్షన్ జరగనున్నాయి. జిల్లాలో మొదటి విడతలో రాజాపూర్, మహబూబ్ నగర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఎలక్షన్ జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
News November 26, 2025
మహబూబ్నగర్: మొదటి విడత ఎన్నికలు జరిగేవి ఇక్కడే

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతే తెలిసింది. జిల్లాలో మొదటి విడతలో 139 గ్రామపంచాయతీలకు, 1188 వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఎలక్షన్ జరగనున్నాయి. జిల్లాలో మొదటి విడతలో రాజాపూర్, మహబూబ్ నగర్, నవాబుపేట, గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో ఎలక్షన్ జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.


