News January 12, 2025
అల్లుడి బైక్ ఢీకొని మామ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మం. చిగమంత్ ఘట్టలో బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిత్తప్ప పొలానికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తన అల్లుడు మహేశ్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా వెళ్లి చిత్తప్పను ఢీ కొన్నాడు. ఘటనలో అతడికి గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 7, 2025
సోమందేపల్లి మండలంలో విషాదం.. వివాహిత సూసైడ్

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కేతగాని చెరువులో వివాహిత హిమజ(26) పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఆదర్శ్తో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అదే ఊరిలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
News February 7, 2025
మాతృ భాషను బోధించాలి: అనంత కలెక్టర్

కేంద్రీయ విద్యాలయంలో మాతృ భాష తెలుగును కూడా బోధించాలని, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం గుత్తిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్గదర్శకాల ప్రకారం తరగతి సీట్లను పెంచి అడ్మిషన్స్ పూర్తి చేయాలన్నారు.
News February 6, 2025
మంత్రి పయ్యావులకు సీఎం ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో పనితీరు ఆధారంగా సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ 24వ ర్యాంక్ సాధించారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.