News January 28, 2025

అల్లూరిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి : కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో 73 శాతం అటవీ, ప్రకృతి అందాలు ఉన్నాయని, దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన, అరకుతో పాటు లంబసింగి, మారేడుమిల్లి వరకు పదుల సంఖ్యలో అద్భుతమైన సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలున్నాయన్నారు. వాటన్నింటిని సర్క్యూట్‌గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.

Similar News

News December 4, 2025

తిరుపతి: విద్యార్థులు.. విజ్ఞాన.. విహార యాత్రలు

image

పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన.. విహార యాత్రల నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 44 పాఠశాల్లోని 8, 9 తరగతి విద్యార్థులు 6809 మందిని తీసుకెళ్తున్నారు. ఈనెల 10వ తేదీ లోపు శ్రీహరికోట, జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, చంద్రగిరి కోట ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో విద్యార్థికి రూ.500 కేటాయించింది.

News December 4, 2025

జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలని కేంద్రమంత్రికి వినతి

image

ఏలూరులో మూతపడిన జూట్ మిల్ కార్మికులకు న్యాయం చేయాల్సిందిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఏలూరు, కొత్తూరులోని శ్రీకృష్ణ జూట్ మిల్స్‌కు చెందిన 2యూనిట్లు అకస్మాత్తుగా మూసివేయబడ్డాయి. దీంతో దాదాపు 5,000 మంది కార్మికులు నిరుద్యోగులుగా మారి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కార్మిక సంఘాల నేతలు ఇటీవల ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

News December 4, 2025

GHMC మెగా విలీనంపై అడ్డంకులు.. మరో ఏడాది HMDA నిబంధనలే!

image

విశాలమైన GHMC ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనా క్షేత్రస్థాయిలో పాలనా ప్రణాళికకు అడ్డంకులు తప్పడం లేదు. 27 ULBs‌ను విలీనం చేసినప్పటికీ పౌరులకు ఏకరూప నిబంధనలు ఇప్పట్లో అందుబాటులోకి రావు. విలీన ప్రాంతాల్లో ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ 2013 జోనల్ నిబంధనలే ఇంకో ఏడాది పాటు అమలులో ఉంటాయి. సంక్లిష్టమైన రూల్స్‌ను ఏకీకృతం చేయడంలో అధికారుల జాప్యం కారణంగా కొత్త GHMC, HMDA మాస్టర్ ప్లాన్ 2031 ఆలస్యం కానుంది.