News March 19, 2025
అల్లూరిలో 92మంది దూరం

అల్లూరి జిల్లాలో మొత్తం 71 పరీక్షా కేంద్రాల్లో బుధవారం టెన్త్ హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని DEO. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,548మంది విద్యార్థులకు 11,45 మంది హాజరయ్యారు. 92మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. 99.20శాతం హాజరు నమోదైయిందని చెప్పారు. సరివేలు, ముంచింగిపుట్టు, జోలాపుట్టు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు.
Similar News
News March 20, 2025
ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.
News March 20, 2025
ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
బై.. బై.. ముగిసిన ‘ఇంటర్ ప్రథమ’ పరీక్షలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలతో సందడి చేశారు. ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.