News February 17, 2025
అల్లూరి: అడవిరాజులబాబు పండుగపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్

అల్లూరి జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే అడవిరాజులబాబు పండుగపై బర్డ్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. కోళ్లు, మేకలను కోసి అడవుల్లో వంటలు చేసుకోవడం ఈ పండుగలో ఒక భాగం. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా మార్కెట్లో కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. కాగా.. రాజవొమ్మంగిలో పండగరోజు 2,400 కిలోల మాంసం అమ్ముడుపోయేదని.. కానీ 1,200 కిలోల చికెన్ మాత్రమే అమ్ముడు పోతుందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News November 27, 2025
కడప జిల్లాలో రూ.22.75 కోట్లు మాయం?

కడప జిల్లాలో పేజ్-3 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులు కనిపించడం లేదు. అప్పట్లో ప్రతి ఇంటికి పునాదుల కోసం రూ.35 వేలు వసూలు చేశారు. నిర్మాణాలు మొదలవ్వని 6,501 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.22.75 కోట్లు స్వాహాపై ఇటీవల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 16,765 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 10,264 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతా 6,501 ఇళ్లు ప్రారంభం కాలేదు. దీనిపై విచారణ చేపట్టారు.
News November 27, 2025
రుద్రంగి: ఆర్ఓ కేంద్రాన్ని పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్

రుద్రంగిలో ఏర్పాటు చేసిన RO కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా లేరా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా అని అడిగారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, దరఖాస్తు ఫారాలు తీసుకున్నవారి వివరాలు నమోదు చేయాలన్నారు.
News November 27, 2025
KNR: ‘రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాదులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై పరిష్కారం చూపాలని తెలిపినట్లు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.


