News February 16, 2025
అల్లూరి అనుచరులకు అపార్ట్మెంట్లు సిద్ధం

అల్లూరి వారసులకు కొయ్యూరు మండలం నడింపాలెం వద్ద డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లు సిద్ధం అయ్యాయి. స్వాతంత్ర్య పోరాటంలో నాటి బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన విప్లవవీరుడు అల్లూరికి కుడిభుజంగా పనిచేసిన గాం గంటన్నదొర, మల్లుదొరకు చెందిన 11 కుటుంబాలకు క్షత్రియ పరిషత్ వీటిని ₹3.5 కోట్లతో నిర్మించింది. వీటిని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ సోమవారం ప్రారంభిస్తారు.
Similar News
News November 15, 2025
‘సజ్జనార్’ పేరుతోనే ఫ్రెండ్ను మోసగించిన సైబర్ నేరగాళ్లు!

సైబర్ నేరాలపై అవగాహన కల్పించే హైదరాబాద్ CP సజ్జనార్ మిత్రుడికి కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. ఆయన పేరుతో ఫేక్ FB అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నానంటూ డబ్బులు పంపాలని మెసేజ్లు పంపారు. దీంతో ఇది నిజమే అనుకొని తన స్నేహితుడు రూ.20వేలు పంపించి మోస పోయారని సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్లో డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి’ అని ఆయన సూచించారు.
News November 15, 2025
అబార్షన్ అయినా లీవ్ తీసుకోవచ్చు

మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్ అయినా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే దీనికి తగిన డాక్యుమెంట్లు చూపించాలి. అబార్షన్ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.
News November 15, 2025
వీడీవీకే స్టాల్స్ పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా వన్ ధన్ వికాస కేంద్రాల స్టాల్స్ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. శనివారం ట్రైఫెడ్ ఆధ్వర్యంలో రుషికొండ వద్ద జరుగుతున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్కడ పార్వతీపురానికి చెందిన జీడి ప్రాసెసింగ్ యూనిట్ను, పాచిపెంట వీడీవీకే ద్వారా ఏర్పాటు చేసిన మిల్లెట్స్ స్టాల్ను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డీపీఎం శ్రీరాములు తెలిపారు.


