News March 15, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.

Similar News

News February 16, 2026

నేడు ప్రజావాణి రద్దు: సంగారెడ్డి కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఛైర్మన్, వైస్‌ఛైర్మన్ ఎంపిక కార్యక్రమంలో అధికారులు పాల్గొననున్న సందర్భంగా ప్రజావాణి నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరూ తమ సమస్యలపై కలెక్టరేటుకు రావొద్దని కోరారు.

News February 16, 2026

చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

image

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, చర్మంముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గట్ ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే చేపలు, సిట్రస్‌ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, అవకాడో, దాల్చినచెక్క, గ్రీన్‌టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.

News February 16, 2026

విశాఖలో ‘షాడో మంత్రి’(1/3)

image

విభజిత విశాఖ జిల్లాలో మంత్రి పదవి లేకపోయినా ఆ సీనియర్ ఎమ్మెల్యే మీసం మెలేస్తే.. మంత్రి కన్నా పవర్‌ఫుల్‌గా పనులు అవుతున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తోంది. అధికారుల బదిలీలు, బార్ టెండర్లు, లిక్కర్ సిండికేట్లు, భూముల ఫైళ్లలో ఆయన చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ‘షాడో మంత్రి’గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.