News March 5, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 209మంది విద్యార్థులు గైర్హాజరు

image

అల్లూరి జిల్లా లో బుధవారం జరిగిన ఇంటర్మీడియేట్ ద్వితీయ ఇంటర్ పరీక్షకు 209మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి అప్పలరాం తెలిపారు. జిల్లాలో 26పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లిష్  2పేపర్‌కు 5464మందికి గాను 5330మంది హజరు కాగా 134మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. 8పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఒకేషనల్ పరీక్షకు 1212మందికి గాను 1137మంది హాజరు అయ్యారని, 75మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.

Similar News

News November 23, 2025

సిరిసిల్ల: సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త: ఎస్పీ

image

పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News November 23, 2025

నిర్మల్: పర్యటన రూట్ కాదు.. రిస్క్ రూట్

image

గడిచిన పది నెలల్లో జిల్లాలో 522 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 139 మంది ప్రాణాలు కోల్పోగా.. 612 మంది క్షతగాత్రులు గాయపడ్డారు. ప్రధానంగా నిర్మల్-భైంసా, బాసర-భైంసా, నిర్మల్-ఖానాపూర్ మార్గాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని ఎస్పీ జానకి షర్మిలా సూచించారు.

News November 23, 2025

వరంగల్: మూఢం ప్రారంభం.. శుభకార్యాలకు బ్రేక్!

image

ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే శుక్ర మౌఢ్యం ఫిబ్రవరి 17, 2026 వరకు కొనసాగనుంది. దాదాపు మూడు నెలలు శుభముహూర్తాలు లేకపోవడంతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో వివాహాలు, గృహ ప్రవేశాలు, ప్రతిష్ఠాపనలు నిలిచిపోనున్నాయి. రథ సప్తమి, వసంత పంచమి, మాఘపౌర్ణమి కూడా మౌఢ్యంలో పడటం వల్ల కార్యాలు జరగవు. దీంతో ఫంక్షన్ హాళ్లు, జ్యువెలరీ, బట్టల షాపులు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ రంగాల్లో భారీ నష్టం తప్పదని పురోహితులు చెబుతున్నారు.