News March 1, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలు.. 666 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 666మంది అయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. సాధారణ పరీక్ష తెలుగు 1కి 6,350 మంది విద్యార్థులకు గాను 5,892 మంది హజరైయ్యారని అని పేర్కొన్నారు. 458మంది హాజరు కాలేదని తెలిపారు. ఒకేషనల్ పరీక్ష‌కు 1,301 మంది విద్యార్థులకు గాను 1,093 మంది హజరు కాగా 208మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు.

Similar News

News December 16, 2025

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

image

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News December 16, 2025

భార్య నల్లగా ఉందని..

image

AP: పల్నాడు(D) వినుకొండలో అమానవీయ ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తమామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మి, కోటేశ్వరరావులకు ఈ జూన్ 4న వివాహమైంది. ₹12L నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

News December 16, 2025

నల్గొండలో పోలింగ్‌కు పటిష్ఠ భద్రత

image

నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు. విజేతల ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం విధించారు.