News March 5, 2025

అల్లూరి: ఈనెల కూడా పప్పూ.. పంచదార లేదు..!

image

అల్లూరి జిల్లాలో కందిపప్పు, పంచదార ఈనెల కూడా చౌక డిపోలకు చేరలేదు. జిల్లా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దీంతో తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్‌కు నిరాశ తప్పలేదు. జిల్లాలో మొత్తం 671 చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేసేందుకు 298 టన్నుల కందిపప్పు, 168 టన్నుల షుగర్ అవసరం. కాగా ఈ నెల కందిపప్పు ఇంకా సరఫరా కాలేదని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ గణేశ్ కుమార్ అన్నారు.

Similar News

News January 6, 2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులు

image

<>CSIR<<>>-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 14 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అర్హత గలవారు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. జనవరి 8న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. డిప్లొమా అప్రెంటిస్‌లకు 18-24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్‌లకు 21 నుంచి 26ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.nio.res.in

News January 6, 2026

గ్యాస్ లీక్.. రూ.వందల కోట్ల నష్టం?

image

AP: అంబేడ్కర్ కోనసీమ(D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి <<18770706>>లీకవుతున్న<<>> గ్యాస్‌ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాసేపట్లో ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ చేరుకోనున్నాయి.

News January 6, 2026

8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనాలు

image

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 8వ రోజుకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల బుధవారం, గురువారం రాత్రి వరకు సాగనున్నాయి. ఇప్పటివరకు లక్కి డిప్‌లో టోకెన్లు పొందిన స్థానికులు ఇవాళ నుంచి మూడు రోజులు దర్శనం చేసుకోనున్నారు. 7రోజు పాటు వైకుంఠ ద్వార దర్శనం 5,42,057 మంది భక్తులు చేసుకున్నారు.