News March 1, 2025

అల్లూరి: ఒక్క నిమిషం .. వారి కోసం..!

image

అల్లూరి జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో 5,128 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే.వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

Similar News

News March 1, 2025

మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్

image

TG: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ కులం నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నివాసంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్, BJP, BRSకు చెందిన కాపు నేతలు పాల్గొన్నారు. కులగణనలో కాపుల సంఖ్యను తగ్గించారని, ప్రభుత్వ/నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సభ, మంత్రి పదవి ఇస్తేనే కులగణనపై కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News March 1, 2025

ఫిబ్రవరి GST కలెక్షన్స్ @ రూ.1.84లక్షల కోట్లు

image

ఫిబ్రవరిలో స్థూల GST వసూళ్లు 9.1% పెరిగి రూ.1.84లక్షల కోట్లుగా ఉన్నాయి. స్థానిక రాబడి 10.2% ఎగిసి రూ.1.42లక్షల కోట్లు, దిగుమతులపై రాబడి 5.4% ఎగిసి రూ.41,702కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో CGST రూ.35,204 కోట్లు, SGST రూ.43,704 కోట్లు, IGST రూ.90,870 కోట్లు, సెస్ రూ.13,868 కోట్లు. ఇక రూ.20,889 కోట్లు రీఫండ్ చెల్లించగా నికర GST రూ.1.63లక్షల కోట్లుగా తేలింది. 2024 FEBలో ఇది రూ.1.50 లక్షల కోట్లే.

News March 1, 2025

నేనెవ్వరినీ బెదిరింపులకు గురిచేయట్లేదు: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ <<15611310>>తనపై ఎదురుదాడి<<>> చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తానెవ్వరినీ బెదిరింపులకు గురి చేయట్లేదని స్పష్టం చేశారు. రేవంత్ మాటల్లో పార్టీ నేతల్లోని అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయని చెప్పారు. మోదీ హయాంలో రూ.10 లక్షల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపట్టినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!