News March 2, 2025
అల్లూరి: చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

ముంగర్లపాలెంలో చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు ఆదివారం తెలిపారు. జీ మాడుగుల మండలం గడుతూరుకు చెందిన గెమ్మెలి శేఖర్ తన చిన్నాన్న గ్రామమైన మండలంలోని సీతకండికి కూలీ పనుల నిమిత్తం వచ్చాడు. ఈ క్రమంలో ముంగర్లపాలెంలో చింతచెట్టు ఎక్కగా చెట్టుపై నుంచి పడిపోవడంతో మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు.
Similar News
News July 9, 2025
‘మెగా 157’: పోలీసులుగా చిరు, వెంకీ?

చిరంజీవి-నయనతార కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మెగా 157’లో తన క్యామియో ఉంటుందని <<16974411>>వెంకటేశ్<<>> చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది క్యామియో కాదని.. దాదాపు గంటసేపు ఆ పాత్ర ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పైగా, చిరు-వెంకీ అండర్ కవర్ పోలీసులుగా ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారని టీటౌన్లో ప్రచారం మొదలైంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరి మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది.
News July 9, 2025
కృష్ణమ్మలో గోదావరి జలాలు.. మంత్రి పూజలు

AP: పట్టిసీమ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కృష్ణమ్మలో కలిశాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పవిత్ర సంగమంలో మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే ఇప్పటివరకు 428 TMCలకు పైగా కృష్ణాకు తరలించామని తెలిపారు. చంద్రబాబు ముందుచూపు వల్లే గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో పంటలు పండుతున్నాయని, ఆయన ముందుచూపుకు ఈ ప్రాజెక్టే ఒక ఉదాహరణ అని అన్నారు.
News July 9, 2025
ఏలూరులో పురుగు మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది వృద్ధురాలు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దెందులూరు మండలం మలకచర్లలో చేసుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సీతమ్మ (60) భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి జీవిస్తుంది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.