News April 5, 2025

అల్లూరి జిల్లాలో ఎటపాక ఫస్ట్, మారేడుమిల్లి లాస్ట్

image

అల్లూరి జిల్లాలో ఉపాధి హామీ పనులు 2024-25 ఆర్థిక సం.లో లక్ష్యానికి మించి(164% ) పని దినాలు కల్పించడంలో ఎటపాక మండలం ప్రథమంగా నిలిచిందని డ్వామా పిడి విద్యాసాగర్ తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు. ద్వితీయ స్థానంలో రాజవొమ్మంగి(134%), చివరి స్థానంలో మారేడుమిల్లి(86%) మండలాలు ఉన్నాయని తెలిపారు.

Similar News

News April 7, 2025

కంచ భూములపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

image

TG: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేశారని పేర్కొంది. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. న్యాయస్థానం ఈ నెల 24న విచారిస్తామంది.

News April 7, 2025

ట్రంప్ టారిఫ్స్.. 10 శాతం కుంగిన టాటా షేర్లు

image

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో టాటా మోటార్స్ షేర్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి. టారిఫ్‌ల నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎగుమతులు నిలిపేయాలన్న సంస్థ నిర్ణయంతో 10 శాతం మేర కుంగాయి. కార్ల ఎగుమతిపై అమెరికా విధించే 26శాతం సుంకాలు ఈ నెల 2నుంచే అమలుకాగా, విడిభాగాలపై పన్నులు మే3 నుంచి వర్తిస్తాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు కార్ల ఎగుమతి విలువ 8.9 మిలియన్ డాలర్లు కాగా, మెుత్తం ఎగుమతుల్లో ఇది 0.13 శాతమే.

News April 7, 2025

ఒంటిమిట్ట: అధికారులకు మంత్రుల దిశానిర్దేశం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవితలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవన మందిరంలో సమావేశం నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

error: Content is protected !!